Friday, May 10, 2024

వైసిపి ఎమ్మెల్యేల జాత‌కాలు రెడీ..సీన్… క్లైమాక్స్ కు

13న చివరి వర్క్‌షాపు
ఏర్పాట్లలో పార్టీ బాధ్యులు
అన్ని రకాల నివేదికలు చేతిలో పెట్టుకున్న సీఎం
ఎవరెవరికి చలనం.. ఇంకెవరికి మొండిచేయి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ

అమరావతి, ఆంధ్రప్రభ: అమాత్యుల పనితీరును కొలతవేసే ఆఖరి పరీక్ష నిర్వహించేందుకు అధికార పార్టీ అధినేత, ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తు న్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై చిట్టచివరి వర్క్‌ షాపు నిర్వహణకు ఆయన ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 13న చిట్టచివరి వర్క్‌ షాపు నిర్వహించి అమాత్యుల జాతకాల చిట్టాను బయట పెట్టేందుకు పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు- చేసారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరుపై క్షేత్ర స్థాయి సర్వే నివేది కలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు- చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణ యాలకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై ఫోకస్‌ పెట్టా రు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.

13న కీలక సమావేశం
ఈ నెల 13న మంత్రులు..ఎమ్మెల్యేలు..పార్టీ సమన్వయక ర్తలతో సీఎం జగన్‌ సమావేశం ఏర్పాటు- చేసారు. ఇప్పటికే పార్టీ రీజలన్‌ కో ఆర్డినేటర్లతో సమావేశమైన ఆయన ఈ సారి మంత్రులు ఎమ్మెల్యేలతో మీటింగ్‌కు నిర్ణ యం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతీ సచి వాలయ పరిధిలో కన్వీనర్లు..గృహ సారథుల నియమాకంపై నిర్ణయించినా..ఇప్పటికీ నియా మకాలు పూర్తి కాలేదు. రీజనల్‌ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకంపై సీఎం గట్టి గానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైమరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి ముఖ్య మంత్రి సర్వే వివరాలను వెల్లడించారు. ప్రజల్లో గ్రాఫ్‌ పెరగక పోతే సీట్లు- ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పని తీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో సీఎం ఏం చెప్ప బోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది.

ఎమ్మెల్యే ప్రోగ్రస్‌ రిపోర్టులు సిద్ధం
వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు సంబంధించిన ప్రోగ్రస్‌ రిపోర్టులు ఐ పాక్‌తో పాటు-గా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు- సమాచారం. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో, పార్టీ కేడర్‌తో మమేకం అవుతున్న విధానం, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు- తెలుస్తోంది.
ఈ ప్రత్యక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరుపైఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు- ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. ప్రతిపక్ష టీ-డీపీ సిట్టింగ్‌లకు సీట్లు- ఖరారు చేయటంతో పాటు-గా కొత్తగా ఇంఛార్జ్‌లను నియ మిస్తోంది. దీంతో ప్రత్యర్ది పార్టీల వ్యూహాలను గమనిస్తూ గెలుపే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి ఖరా ఖండిగా చెబుతున్నారు. గెలిచే వారికే టికెట్లు- అనే సిద్దాంతం మాత్రమే అభ్యర్ధు ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు. ఈ వ్యవహారం పై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు.

అసెంబ్లి సమావేశాల తరువాత
అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల తరువాత నుండి అందరు ఎమ్మెల్యేలు ప్రజల్లో విధిగా తిరిగేలా కార్యాచరణ మరింత పటిష్టంగా రూపొందిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి తాను కూడా మినహాయింపేమీ కాదని స్పష్టంచేశారని తెలుస్తోంది. తాను కూడా వారంలో రెండు రోజులపాటు తప్పకుండా ప్రజల మధ్యే గడిపే కార్య క్రమం పెట్టుకున్నానని ఇప్పటికే చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే ఏప్రిల్‌ నుండి బస్సు యాత్రకు ఆయన సిద్ధమౌతున్నారు. ఆయనకు సమాంతరంగా ఎమ్మెల్యేలు కూడా పల్లెల్లో తిరుగుతూ కనిపించాలని ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement