Monday, May 20, 2024

Uttarakhand – మంచుకొండ‌ల్లో మ‌హా దేవుడు – తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆల‌యం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం తలుపులు శుక్ర‌వారం తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆరు నెలల త‌ర్వాత‌..

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శనలో భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే.. శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.

- Advertisement -

12న బద్రీనాథ్ ఆలయం

మరోవైపు యమునోత్రి ఆలయం కుండా శుక్ర‌వారం ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరిచారు. ఇక చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement