Wednesday, May 8, 2024

90 లక్షల నిధులతో – రోడ్లు ప్రారంభించిన మంత్రి పువ్వాడ

మంత్రి పువ్వా డ అజయ్ కుమార్, మేయర్ పి నీరజ తో కలిసి కార్పొరేషన్ పరిధి లోని పలు డివిజన్ లలో పర్యటించారు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు 30 కోట్ల రూపాయలతో మౌలిక వసతులతో పాటు ..సీసీ రోడ్లు నిర్మిస్తున్నామ‌న్నారు. అవసరమైన ప్రతిచోట సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 డివిజన్ లో 12.50 లక్షలతో మమత రోడ్.21, డివిజన్ 5ఎలిమెంట్స్ 18.30లక్షలు, శ్రీ చైతన్య స్కూల్ వద్ద 17.50లక్షలు, 50 డివిజన్ 16.20 లక్షలు ,రమణ గుట్ట లో 22.50 లక్షల, నిధులతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ,సూడా చైర్మన్ విజయకుమార్, కమిషనర్ ఆదర్శుసురభి, కార్పొరేటర్లు రాపర్తి శరత్ ,కే మురళి, ఏ నిరీషరెడ్డి పగడాల నాగరాజు, గుండాల కృష్ణ లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement