Sunday, May 19, 2024

TS : ఎములాడ రాజన్నను దర్శించుకోనున్న ప్రధాని

లోక్​ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న రాత్రి హైదరాబాద్​కు చేరుకొని రాజ్​భవన్​లో బసచేశారు. ఇవాళ ఉదయం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్నను దర్శించుకుంటారు.

కాగా, ఇవాళ ఉదయం ప్రధాని మోదీ రాజ్​ భవన్​ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుంటారు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొంటారు. అనంతరం వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేష్ గెలుపు కోరుతూ….ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.  మామునూర్ సమీపంలోని లక్ష్మీపురం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement