Sunday, May 19, 2024

భారీగా త‌గ్గిన క‌రోనా : వెయ్యి లోపే కేసులు

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. ఎంత త‌క్కువ‌గా అంటే… దేశ వ్యాప్తంగా వెయ్యి కేసుల్లోపే న‌మోద‌య్యాయి. కట్టడిలో ఉన్నప్పటికీ… గత 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య మాత్రం పెరిగింది. కేంద్ర వైద్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 58 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు మృతుల సంఖ్య 13గా ఉండటం గమనార్హం.
ఇక ప్రస్తుతం దేశంలో 12,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,96,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 79.15 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించారు. 184.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement