Thursday, May 9, 2024

Breaking : అయోధ్య‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం – ముగ్గురు మృతి – 30మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌నగరి అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ర‌హ‌దారిపై ఓవర్‌టేక్ చేస్తుండగా ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను అయోధ్యలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి బన్సీ, సిద్ధార్థ్ నగర్ వైపు వెళ్తోంది. ప్రమాదం అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ క్షతగాత్రులకు అన్ని విధాలా సాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రమాదంలో బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో సరిచేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement