Sunday, April 28, 2024

FLASH: ఉసురు తీసుకున్న వివాహేతర బంధం.. ప్రేమజంట ఆత్మహత్య

వారిద్దరికీ వేరు వేరుగా పెళ్లి అయ్యింది. ఇద్దరికి కుటుంబం పిల్లలు ఉన్నారు. కానీ వివాహేతర సంబంధం చివరికి ప్రేమ జంట ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రెఖ్య తండాలో మంగళవారం వెలుగుచూసింది. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం రెఖ్య తండాకు చెందిన బాణోత్ నవీన్(రూప్ల)35, బాణోత్ శారదా (32) ఇద్దరు వరుసకు వదిన మరిదీలు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు స్థానిక సమాచారం. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం ఇద్దరు తండా నుంచి వెళ్లిపోయారు. తిరిగి సోమవారం రాత్రి తండాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అందరిలో పరువు పోయిందని ఇద్దరు వేర్వేరుగా సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement