Friday, April 26, 2024

Breaking: జై బోలో దేశ్ కీ నేత కేసీఆర్‌.. ప‌టాకుల మోత‌, మారుమోగుతున్న స్లోగ‌న్స్‌

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్న నేప‌థ్యంలో దేశం మొత్తం తెలంగాణ వైపు ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. మ‌ధ్యాహ్నం 1:19 గంట‌ల‌కు జాతీయ పార్టీ పేరును ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో వివిధ రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు హైద‌రాబాద్ చేరుకుని కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తున్న క్ర‌మంలో రాష్ట్ర‌వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు జ‌రుపుకుంటున్నారు. కాగా, ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక కాన్వాయ్‌లో తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లోనే పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ప్రారంభం కాబోతోంది.

ప్రగతి భవన్ నుంచి 12 గంటల 13 నిమిషాలకు టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ భవన్ చేరుకున్నారు… భారీ కాన్వాయ్ తో ఆయన బయలుదేరారు… ప్రగతిభవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరగానే టిఆర్ఎస్ శ్రేణులు దారి పొడవున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు… భారీ ప్రదర్శన. రాలి ముందు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంది… అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement