Thursday, April 25, 2024

Breaking: ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో హైద‌రాబాద్ వ‌స్తున్న స్పీక‌ర్ పోచారం..

బాన్సువాడ (కామారెడ్డి జిల్లా): ముఖ్యమంత్రి, TRS పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్న TRS పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి బాన్సువాడ శాసనసభ్యుడు, శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ నుండి హైదరాబాద్ కు ప్రత్యేక హెలికాఫ్టర్ లో బ‌య‌లుదేరారు.

దసరా పండగ సంద‌ర్భంగా త‌న కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి కేసీఆర్ ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్పీకర్ పోచారంతో క‌లిసి హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వ‌స్తున్నారు. సర్వసభ్య సమావేశం అనంతరం తిరిగి హెలికాఫ్టర్ లో పోచారం హైదరాబాద్ నుండి బాన్సువాడ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement