Saturday, April 27, 2024

హాకీలో భారత్ బోణీ.. న్యూజిలాండ్ పై ఘన విజయం

ఒలింపిక్స్​లో భారత వేట మొదలైంది. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన 3-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి క్వార్టర్ చివరి వరకు 1-0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్స్‌ను బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్‌ను 1-1తో సమం చేసారు. ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  హర్మన్​ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ కొట్టగా, రూపిందర్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ కొట్టి ఆకట్టుకున్నారు. భారత జట్టు తమ రెండో మ్యాచ్‌లో జూలై 25న పటిష్టమైన ఆస్ట్రేలియాతో ఆడనుంది.

ఇది కూడా చదవండిః 40 మంది సలహాదారులు అవసరమా?: ఏపీ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్న

Advertisement

తాజా వార్తలు

Advertisement