Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 43 వేల కరోనా కేసులు నమోదు..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటకిి.. కొన్ని రోజులుగా కేసులు నిలకడగానే నమోదవుతున్నాయి. దేశంలో నిన్న  43,071  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 52,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 955 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  4,02,005కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,96,58,078 మంది కోలుకున్నారు. 4,85,350 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,12,21,306 వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఇది కూడా చదవండి: ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉంది: WHO

Advertisement

తాజా వార్తలు

Advertisement