Friday, May 3, 2024

ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉంది: WHO

కరోనా మహమ్మారి ప్రమాదకరమైన దశలో ప్రపంచం ఉందని WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ వైరస్‌ డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలను నివారించడం, ఇండ్లను వెంటిలేషన్‌ చేయడానికి తగిన ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని టెడ్రోస్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి కొవిడ్‌ టీకాలు వేసేలా చూడాలని ప్రపంచ నేతలను కోరారు.

ఇక తక్కువ జనాభాకు టీకాలు వేసిన దేశాల్లో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య మళ్లీ పెరగడంపై ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికీ ఇంకా ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని..డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమైందని, వైరస్‌ కాల క్రమేణా మారుతున్నందున నిరంతరం దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కఠినమైన నిఘా, ప్రారంభంలో వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్‌ చేయడం ఇప్పటికీ ముఖ్యమేనన్నారు.

ఇది కూడా చదవండి: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement