Monday, May 20, 2024

TS : నేడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వెళ్ల‌నున్న సీఎం రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి వెళ్ల‌నున్నారు. ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి యూపీకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్‌కు వ‌స్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం ధర్మపురిలో జరగనున్న జన జాతర సభకు ముఖ్యమంత్రి హాజరయి ప్రసంగిస్తారు.అలాగే సిరిసిల్ల జన జాతర సభలో పాల్గొంటారు. రాత్రి ఉప్పల్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement