Wednesday, May 22, 2024

TS | అంతులేని అభిమానం.. వరి పొలంలో కేసీఆర్ ముఖచిత్రం

నిజామాబాద్ (ప్రభ న్యూస్) : ముఖ్యమంత్రి కేసీఆర్ పై త‌న‌కు ఉన్న అభిమానాన్ని మాటలలొ కాకుండా, చేత‌ల‌లో చూపించాడో అభిమానం. తన వ్యవసాయ పొలంలో వరి వంగడలతో ఏకంగా కేసీఆర్ ముఖ‌చిత్రాన్నే సృష్టించాఉ. ఇది మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డికి సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల‌కు కేసీఆర్ చేసిన మేలుపై తన అభిమానాన్ని చాటుకోవాలని ఈ ఆలోచిన చేశాడు. 24 గుంటల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకార భూమిలో కేసీఆర్ చిత్రపటం ఏరియల్ వ్యూలో కనిపించేలా వరి నాటు వేసి అభిమానాన్ని తెలియ‌జేశాడు.

రైతు కుటుంబంలో పుట్టిన మార గంగారెడ్డి ఆదర్శ రైతుగా, అంకాపూర్ సహకార సంఘం అధ్యక్షుడిగా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులోని ఫామ్ హౌస్ లో కెసిఆర్ ముఖచిత్రం కనిపించేలా నాటిన ఈ వ‌రినాటు వేసి అంద‌రినీ ఆశ్య‌ర్యంలో ముంచెత్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement