Sunday, May 12, 2024

సిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసిన.. సీఎం జైరామ్ థాకూర్

సిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ రాష్ట్ర సీఎం జైరామ్ థాకూర్ ఓటేశారు. నేడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సిరాజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం ఫ్యామిలీ కూడా ఓటింగ్‌లో పాల్గొంది. మండీలోని 44వ పోలింగ్ స్టేష‌న్‌లో ఆయ‌న ఓటేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. హిమాచ‌ల్‌లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉద‌యం నుంచి భారీగానే ఓటింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఓటింగ్‌లో రికార్డు క్రియేట్ చేయాల‌ని ఇవాళ ప్ర‌ధాని మోడీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్ర‌తిభా సింగ్‌, ఆమె కుమారుడు, ఎమ్మెల్యే విక్ర‌మాధిత్య సింగ్ ఓటేశారు. అంత‌క‌ముందు వాళ్లు షిమ్లాలోని శ‌ని ఆల‌యంలో పూజ‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement