Sunday, April 28, 2024

భారత్ లో కొత్తగా 833 కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా.. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 833 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,528కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.78 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement