Friday, May 10, 2024

AP : విశాఖ తీరంలో క్రూయిజ్ షిప్… చూసేందుకు నగర వాసుల ప‌రుగులు

విశాఖ తీరంలో తొ లిసారిగా ప్రైవేటు క్రూయిజ్ షిప్ లంగరు వేసింది. ఎం ఎస్ ది వ‌ర‌ల్డ్ పేరుతో ఉన్న ఈ క్రూయిజ్ ప్ర‌స్తుతం సుమారు 600 మందితో ప‌ర్యాట‌కుల‌తో నేడు విశాఖ పోర్టుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ వున్న ప‌ర్యాట‌కుల‌కు ఈ క్రూయిజ్ లో ప‌య‌నించ‌డం హాబీ. అమెరికాలో బయలు దేరిన ఈ ప్రయివేట్ క్రూయిజ్ రెండు రోజుల పాటు విశాఖలో ఉండనుంది.

- Advertisement -

కాగా, రెండేళ్ల క్రితం విశాఖకు క్రూజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్డోలియో ఎంప్రస్ నౌక విశాఖ – పుదుచ్చేరి – చెన్నయ్ మధ్య షటిల్ చేసింది. ఈ ఏడాది షెడ్యుల్ ఖరారైన పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేశారు. అయితే ఇప్పటికే విశాఖలో క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించింది. ఇప్పుడు ఈ క్రూయిజ్ షిప్ ఇక్క‌డ ఆగింది.. ఈ క్రూయిజ్ చూసేందుకు విశాఖ వాసులు భారీ సంఖ్య‌లో లంగ‌ర్ చేసిన టెర్మిన‌ల్ కు వ‌స్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement