Wednesday, May 8, 2024

Breaking : హుజురాబాద్ లో ఓట‌మితో టీఆర్ ఎస్ లో ప్ర‌కంప‌న‌లు – అహంకార ధోర‌ణిలో కేసీఆర్ – కిష‌న్ రెడ్డి

సీఎం కేసీఆర్ అహంకార ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ నాంప‌ల్లి బిజెపి కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.. హుజురాబాద్ రిజ‌ల్ట్ త‌ర్వాత కేసీఆర్ పూర్తిగా మారిపోయార‌న్నారు. హుజురాబాద్ లో ఓట‌మితో టీఆర్ ఎస్ లో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయ‌ని ఎద్దేవా చేశారు. ఈ ఓట‌మితోనే కేసీఆర్ కుటుంబంలోనూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌న్నారు. హుజూరాబాద్ లో ఓట‌మితో కేసీఆర్ కి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. ఈ మేర‌కు కేసీఆర్ కి, కిష‌న్ రెడ్డి కౌంట‌ర్ వేశారు. త‌న‌ని కాద‌ని హుజూరాబాద్ జ‌నం ఈట‌ల‌కు మ‌ద్ద‌తిచ్చార‌నే ప‌గ‌తో ర‌గిలిపోతున్నార‌ని తెలిపారు. హుజురాబాద్ ఫ‌లితం వ‌చ్చిన మ‌రుస‌టి రోజు నుండే కేసీఆర్ ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. తెలంగాణ స‌మాజం త‌న కాళ్ల కిందే ఉండాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ పూర్తిగా దిగ‌జారి మాట్లాడుతున్నార‌ని అన్నారు. ప్ర‌ధానిపైనా,కేంద్రంపైనా అబ‌ద్ధ‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అస‌బంద్ధ‌మైన విష‌యాల‌తో కేంద్రంపై విషం క‌క్కుతున్నార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement