Saturday, May 4, 2024

T20 : వ‌ర‌ల్డ్ క‌ప్ …రెండు జ‌ట్ల‌కు స్పాన్స‌ర్ గా నందిని మిల్క్ …

టీ20 ప్రపంచకప్‌ 2024 సిరీస్‌ జూన్‌ 1 నుంచి జూన్‌ 29వరకు జరగనుంది. యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ సిరీస్‌లో 20 జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ సీజన్‌లో రెండు జట్లకు కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని సంస్థ డెయిరీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

టీ20 వరల్డ్‌ కప్‌లో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌షిప్‌ అందిచనుంది. ఈ విషయన్నికేఎంఎఫ్‌ ఎండీ ఎం.కే. జగదీష్‌ వెల్లడించారు. “ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌ చేయనున్నాం. ‘నందిని స్ల్పాష్‌’ పేరుతో అమెరికాలో ఎనర్జీ డ్రింక్‌లను తీసుకురావాలని చూస్తున్నాం. ఈ సమయంలో ప్రపంచకప్‌ స్పాన్సర్‌షిప్‌తో ప్రపంచవ్యాప్తంగా మా ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుంది. గ్లోబల్‌ బ్రాండ్‌గా మారేందుకు మాకు ఇదో అవకాశం” అనిఅన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement