Thursday, May 16, 2024

తెలంగాణ సరిహద్దులో దారుణం.. పోలీసులకు ‘దండం’ పెట్టి వేడుకున్న మహిళ

లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి కరోనా బాధితులతో వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆస్పత్రిలో బెడ్ దొరికినట్లు ప్రూఫ్ చూపించినా అనుమతించట్లేదు. తిరుపతికి చెందిన ఓ మహిళ తన భర్తను హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకొస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆపేశారు. ‘పర్మిషన్ ఉంది, నా భర్తను బతికించండి’ అంటూ వేడుకున్నా పోలీసులు కనికరం చూపలేదు. దీంతో ఆ మహిళ కన్నీరుమున్నీరైంది. తమకు వైద్యం అందించాలని కోరింది.

దాదాపు 20 నుంచి 30 అంబులెన్సులను పోలీసులు ఆపేసినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో బెడ్ అలాట్ అయింది అనే టై అప్ సర్టిఫికెట్ ఉంటేనే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపిన సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement