Thursday, May 16, 2024

Medchal: విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లంపేట్‌లో విద్యుత్ షాక్‌ తో 11 ఏళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి (30) మృతి చెందాడు. మల్లంపేట్ డ్రీమ్ వెల్లి కాలనీలో నీటి సంపు‌ శుభ్రం చేస్తుండగా బాలుడు భవానీ ప్రసాద్ కు ప్రమాదం జరిగింది. నీటి సంపులో ఎలక్ట్రిక్ సబ్ మెర్సిబుల్ మోటర్ విద్యుత్ ఘాతానికి బాలుడు భవానీ ప్రసాద్, గాదె జానా రెడ్డి బలయ్యారు. సమాచారం అందిన వెంటే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement