Friday, April 26, 2024

బూతు వీడియోల వ్యవహారం.. మరో ముగ్గురు ఉద్యోగులపై వేటు

టీటీడీకి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్‌లో ముగ్గురు ఉద్యోగులపై వేటు పడింది. ఎస్వీబీసీ ఎడిటర్ కృష్ణారావు, చానల్ మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో అశ్లీల చిత్రాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిపై వేటు పడినట్టయింది. ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలతో కూడిన వీడియోలు ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.

గతంలో ఓ భక్తుడు ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘శతమానం భవతి’ కార్యక్రమానికి ఈ-మెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగి ఎంతో నిర్లక్ష్యపూరితంగా ఓ అశ్లీల వీడియో లింకు పంపాడు. దాంతో ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైవీ విచారణకు ఆదేశించారు. ఛానల్‌లోని పలువురు కీలకస్థానాల్లో ఉన్న ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో అశ్లీల చిత్రాలు చూస్తున్నట్టు గుర్తించి అప్పట్లోనే కొందరిపై వేటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement