Wednesday, April 24, 2024

జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తాం – బండారు పోతులయ్య

ధర్మవరం అర్బన్ – ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బండారు పోతులయ్య, బూద ప్ప, తెలిపారు. సోమవారం స్థానిక ఐసిఐసి బ్యాంక్ సమీపంలోని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, సాకే నాగరాజు, నారాయణ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement