Tuesday, May 21, 2024

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న – శ్రీ విద్యాప్ర‌స‌న్న తీర్థ‌రు స్వామీజీ

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు ద‌క్షిణ క‌ర్ణాట‌క‌లోని కుక్కి సుబ్ర‌మ‌ణ్యంలో ఉన్న శ్రీ‌సుబ్ర‌మ‌ణ్య మాతా పీఠాధిప‌తి శ్రీ విద్యాప్ర‌స‌న్న తీర్థ‌రు స్వామీజీ . గురువారం తిరుమ‌ల‌కు చేరుకున్న శ్రీ‌విద్యాప్ర‌స‌న్న తీర్థ‌రు స్వామీజీని ఆల‌య అధికారులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికి గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లారు. ఆయ‌న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం టీటీడీ డిప్యూటీ ఈఓ హ‌రిద్ర‌నాథ్ ఆయ‌న‌కు స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.ఈ కార్య‌క్ర‌మంలో వీజీఓ బాలిరెడ్డి, బొక్కసం క్లర్క్ గురురాజరావు, పర్పతేయాదార్ తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌విద్యాప్ర‌స‌న్న తీర్థ‌రు స్వామీజీ మాట్లాడుతూ.. స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం చాలా సంతోషంగా ఉన్న‌ద‌ని చెప్పారు. స్వామివారి కృపాక‌టాక్షాల‌తో ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని కోరుకున్న‌ట్లు స్వామీజీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement