Friday, April 26, 2024

Telangana cabinet: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ఈరోజు ప్రగతి భవన్ లో భేటీ అయిన తెలంగాణ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య అంశాలపై చర్చ జరిగింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశాం. ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.

ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నిర్ణయాలు ఇవే…

  • వరంగల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీ నగర్ గడ్డి అన్నారం, ఆల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం.
  • అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఇకపై తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గా నామకరణం.
  • అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.
  • మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు.
  • రాష్ట్రంలో మున్ముందు అనుమతించబోమే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులకు సీఎం ఆదేశం.
  • అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని, అందుకు సంబందించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని క్యాబినెట్ ఆదేశం.
  • పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజా అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు.
Advertisement

తాజా వార్తలు

Advertisement