Friday, April 26, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,287 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,68,462కు పెరిగాయి. కాగా వైరస్‌ బారినపడిన వారిలో నిన్న 2,430 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇవాళ్టివరకు మొత్తం 19,34,048 మంది కోలుకున్నారు. మరో 21,019 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,395కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 85,856 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: విరిగిపోయిన చెంచా.. కొన్నది 90 పైసలకు.. అమ్మింది రూ.2 లక్షలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement