Friday, April 26, 2024

Tokyo Olympics: కాంస్యం సాధించిన పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు ఓ పతకం సాధించింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన సింధు సెమీఫైనల్లో ఓడి పసిడి పతకానికి దూరమైంది. అయితే కాంస్యం కోసం ఆదివారం నాడు హి బింగ్జియావో(చైనా)తో తలపడిన సింధు.. 21-13, 21-15 తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచే ఎటాకింగ్ ఆడి వరుస గేమ్‌లను కైవసం చేసుకుంది. నెట్ గేమ్ వద్ద కొన్ని సార్లు తడబడినా.. ప్రత్యర్థి చైనా ప్లేయర్‌కు ఎక్కడా ఆధిక్యం ఇవ్వలేదు. తాజా విజయంతో కాంస్యం నెగ్గిన సింధు.. వరుస ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఘనత సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement