Wednesday, March 27, 2024

పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తల్లయ్యింది.. ఒకేసారి నలుగురు పిల్లలు జననం

ఢిల్లీకి చెందిన భార్యాభర్తలకు వివాహమై 8 ఏళ్లు దాటింది. అయినా వారికి సంతానం కలుగలేదు. ఇప్పుడు ఆ బాధ, కొరతను తీరుస్తూ ఒకేసారి సదరు మహిళ నలుగురికి జన్మనిచ్చింది. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. 32 ఏళ్ల మహిళకు ఘాజియాబాద్‌కు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితమే వివాహమైంది. కానీ, అప్పటి నుంచి వారికి సంతాన ప్రాప్తి లేదు. బిడ్డలను కనేందుకు ఎన్నెన్నో మార్గాలను అన్వేషించారు. వైద్యుల వద్దకు వెళ్లారు. ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) వంటి పద్ధతుల్లో సంతానం కోసం ప్రయత్నించారు. కానీ, అవేవీ ఫలించలేదు. ఆమెలో అండాలు తక్కువగా ఉండడం వల్ల ఆమె తల్లి కాలేకపోయింది.

చివరిగా ఢిల్లీలోని సీడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే సంతాన సాఫల్య ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ గౌరీ అగర్వాల్ దంపతులకు అన్ని పరీక్షలు చేసిన తర్వాత.. మహిళ అప్పటికే నాలుగు సార్లు ఐయూఐ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు గుర్తించారు. అండాల ఉత్పత్తికి కారణమయ్యే యాంటీ ములేరియన్ హార్మోన్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని నిర్ధారించి ఆ దిశగా చికిత్స ప్రారంభించారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యం కలిగేలా చేశారు. అలా జూలై 12న ఆమె ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. వారంతా క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: విరిగిపోయిన చెంచా.. కొన్నది 90 పైసలకు.. అమ్మింది రూ.2లక్షలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement