Wednesday, May 22, 2024

కొండారెడ్డి బురుజుకు అత్యాధునిక లైటింగ్ : ఎంపీ టీజీ వెంక‌టేష్‌

కర్నూలు : ఎంపీ లాడ్స్ అలాగే తన సొంత నిధులతో కొండారెడ్డి బురుజుకు అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు కోసం రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ భార్గవి తేజ్, పురావస్తు శాఖ అధికారులు పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ బీజీ వెంక‌టేష్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన కొండారెడ్డి బురుజు ఆధునిక హంగులకు ఎన్ని నిధులైన ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. కొండారెడ్డి బురుజు చుట్టూ తిరిగే వీలుగా రోడ్ నిర్మాణం కోసం చుట్టూ ఉన్న షాపు యజమాని తో మాట్లాడి నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంద‌న్నారు. కర్నూల్ మేయర్ రామయ్య కోరిక మేరకు రాజ్ విహార్ సెంటర్ లో తన సొంత నిధులతో ఫౌంటెన్ ఏర్పాటు చేస్తానని టీజీ వెంకటేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement