Friday, April 26, 2024

హైదరాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో రైల్వే శాఖ అధికారులు తిరుమ‌ల భ‌క్తుల కోసం ప్ర‌త్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ – తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ నుంచి తిరుపతికి, 17న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. వీటితోపాటు నాగర్‌సోల్ – హైదరాబాద్‌, నర్సాపూర్‌-యశ్వంత్‌పూర్‌ మధ్య స్పెషల్‌ ట్రెయిన్‌లు నడుపుతున్నట్లు ప్రకటించింది. నేడు హైదరాబాద్‌ నుంచి నాగర్‌సోల్‌కు, ఈ నెల 15న నాగర్‌సోల్‌ నుంచి హైదరాబాద్‌కు, బుధవారం నర్సాపూర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైలు, గురువారం యశ్వంత్‌పూర్‌ నుంచి నర్సాపూర్‌కు బయలుదేరుతుందని అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement