Saturday, May 25, 2024

ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ లో వైభవంగా సంకటహర గణపతి వ్రతం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం, సంకటహర గణపతి వ్రతం కన్నులపండువగా జరిగాయి. కాణిపాకం నుంచి వచ్చింది పూజారులు వేదమంత్రాలతో శుక్రవారం పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఏపీ భవన్ సిబ్బంది, పోలీసు అధికారులు, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement