Monday, May 6, 2024

హసన్​పర్తి ఎస్సై సస్పెండ్.. అవినీతి ఆరోపణలే కారణం

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : అవినీతి ఆరోపణలు రుజువుకావడటంతో వరంగల్​ జిల్లా హసన్ పర్తి ఎస్ ఐ సాంబయ్యను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సతీమణి వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై అప్పటి ఇన్​ స్పెక్టర్​ శ్రీధర్ రావు, సబ్ ఇన్స్ పెక్టర్ సాంబయ్యను విచారణ చేయాలని ఆదేశించారు.

సదరు ఎస్సై విచారణ సాకుతో పోలీస్ కానిస్టేబుల్ తో 20 లీటర్ల డీజిల్ వాహనంలో పోయించుకోవడంతో పాటు, కొంత నగదును డిమాండ్ చేసినట్టు సీపీ తరుణ్ జోషికి ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా జరిపిన ఎంక్వైరీలో ఎస్​ఐ అవినీతి , అక్రమాలకు పాల్పడ్డట్టు నిరూపితం కావడంతో పోలీస్ కమిషనర్ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement