Monday, May 27, 2024

ఆస్తులు అమ్మి 56 వేల మందికి ప్రాణ‌దానం…

ల‌క్నో – ఓ వ్య‌క్తి త‌న ఇంటిని, భార్య న‌గ‌లను ఆమ్మి ఏకంగా ఇప్ప‌టి వ‌ర‌కూ 56వేల మందికి ప్రాణ‌దానం చేశాడు.. ఇంకా ఆ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తూ ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కుడ‌య్యారు.. వివ‌రాల‌లోకి వెళితే బీహార్ కు చెందిన రాఘ‌వేంద్ర ఓ రోజు అతడి స్నేహితుడు వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురై స్నేహితుడు మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి వాహనాన్ని ఢీకొంది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే రాఘవేంద్ర స్నేహితుడు ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఆదే రాఘవేంద్రలో మార్పునకు కారణమైంది. తన స్నేహితుడి మాదిరి పరిస్థితిని మరొకరు ఎదుర్కోకూడదన్న సదుద్దేశ్యంతో తొమ్మిదేళ్ల క్రితం రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు.

ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారుడు వెళ్లే ప్రయత్నం చేస్తే.. దారి మధ్యలో ఓ వ్యక్తి వారి వాహనానికి బ్రేకులు పడేలా చేస్తాడు. వాహనదారుడి చేతికి ఓ హెల్మెట్ ఉచితంగా ఇచ్చి, విష్ యు ఆల్ ద బెస్ట్ అని పంపిస్తాడు. ఇప్పటి వరకు అతడు 56వేల మందికి హెల్మెట్లను, అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైనవి పంపిణీ చేశాడు. హెల్మెట్ల కొనుగోలు కోసం గ్రేటర్ నోయిడాలోని తన ఫ్లాట్ ను విక్రయించడంతో పాటు తన భార్య ఆభరణాలను కుదువపెట్టి రుణం తీసుకుని మరీ ఉచిత హెల్మెట్ కార్యక్రమాన్నికొనసాగిస్తున్నాడు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం రాఘవేంద్ర కుమార్ సేవలను ప్రశంసించారు. అలాగే రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని నెటిజ‌న్ లు పిలుస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement