Thursday, May 16, 2024

గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌కు స్థిరంగా వరద..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌కు వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 50 714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 51, 914 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 75.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కడెం ప్రాజెక్టుకు 14, 924 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా. గేట్ల మరమ్మతు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో అదే మొత్తం వరదను అధికారులు దిగువకు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1, 26, 561 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 95561 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement