Monday, April 29, 2024

కీల‌క నిర్ణయం తీసుకున్న ద‌క్షిన మ‌ధ్య రైల్వే శాఖ‌.. ప‌లు ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు..!

ప్ర‌భ‌న్యూస్ : ప్రయానికుల‌ రద్దీలేని కారణంగా వారాంతాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను బాగా తగ్గిస్తోన్నాయి. ఈ కార‌ణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ వారం కూడా కీలక ప్రకటన చేసింది. ఈ ఆదివారం అంటే జులై31 నుంచి పలు లోకల్‌ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి- హైదరాబాద్‌ మార్గంలో 9 ఎంఎంటీఎస్‌ రైళ్లు, హైదరాబాద్‌- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్‌నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి- ఫలక్‌నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌- లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి- సికింద్రాబాద్‌ రూట్‌లో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ర్దదన రైళ్ల వివరాలివే..

లింగంపల్లి- హైదరాబాద్‌ మార్గంలో.. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్‌-లింగంపల్లి రూట్‌లో.. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఫలక్‌నూమా- లింగంపల్లి మార్గంలో.. 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

- Advertisement -

లింగంపల్లి- ఫలక్‌నూమా రూట్‌లో.. 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్- లింగంపల్లి మార్గంలో.. 47150

లింగంపల్లి – సికింద్రాబాద్‌ రూట్‌లో.. 47195

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement