Thursday, May 16, 2024

MDK: రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ పేరుతో మ‌రో కొత్త మోసం… ర‌ఘునంద‌న్

కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ పేరుతో మ‌రో కొత్త మోసం చేస్తుంద‌ని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ర‌ఘునంద‌న్ అన్నారు. దుబ్బాకలో రైతు సమ్మేళనం నిర్వ‌హించారు. ఈసందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ….. కలెక్టర్ గా మాట్లాడిన మాటలు.. వరి వేస్తే ఉరి అని బెదిరించిన వ్యక్తి నేడు మీ ముందుకు వస్తున్నాడన్నారు.. ఇది రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అన్నారు. అసెంబ్లీలో మోసపోయి గోసపడుతున్నాం, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఏనాడు పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. గెలిచాక‌ ప్రజలను పట్టించుకోలేదు, పైసలు పంచి గెలుద్దామనే కుట్రలకు తెరతీశారన్నారు. దుబ్బాక ప్రజలు చివర్లో ఆగం కావద్దు, గోస పడొద్దు.. ఎవ‌రికి కష్టం వచ్చినా అందుబాటులో ఉండని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి, సమస్యలపై స్పందించిన పాపాన పోలేదన్నారు.

కారుకు ఓటు వేసినా లాభం లేద‌న్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 వచ్చాయా, రైతుబందు ఊసే లేద‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9న రైతు రుణమాపి అని తప్పించుకున్నోళ్లు.. మళ్ళీ ఆగస్ట్ 15 అంటూ కొత్త నాటకం ఆడుతున్నార‌న్నారు వేయి అబద్దాలు ఆడి అయినా అవసరం వెళ్లదీసుకునే నైజం కాంగ్రెస్ దన్నారు. యూరియా కష్టాలు తీర్చిన వ్యక్తి నరేంద్రమోడీ అన్నారు. కారు పని ఖతమైపోయింద‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొండి చేయి భాస్మాసుర హస్తం చేతిలో మరోసారి మోసపోవద్దు, దేశం కోసం, దేశ రైతుల అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా ఆయా జిల్లాల అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి, సత్యనారాయణ, రాజేందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చింత సంతోష్, ఎస్ఎన్ చారి, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement