Friday, April 26, 2024

కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత‌ చంద్రబాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ నానక్ రాం గూడలోని కృష్ణ నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కృష్ణ నివాసంలో ఆయన భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement