Thursday, April 25, 2024

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేసిన.. అమిత్ షా

ప్రస్తుతం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న భూపేంద్ర పటేలే తమ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి అనే అర్థం వచ్చేలా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారు అంటూ అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తనకూ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలను అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వచ్చిన ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో… గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్రకు అనూహ్యంగా సీఎం పదవి దక్కింది. విజయ్ రూపానీ నుంచి ఆయన సీఎం కుర్చీని దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement