Wednesday, May 22, 2024

National : బిష్ణుపూర్ బ‌రిలో మాజీ మొగుడు, పెళ్లాం ఢీ..

కోల్ క‌తా – 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి బరిలోకి దిగే తమ అభ్యర్థుల పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), ఇటు బిజెపిలు ప్రకటించాయి.. ఈ నేపధ్యంలో ఇక్కడి బిష్ణుపూర్ స్థానం చర్చనీయాంశంగా మారింది. విడాకులు తీసుకున్న ఒక జంట ఈ సీటు నుంచి పరస్పరం పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. రాబోయే లోక్ స‌భ ఎన్న‌క‌ల‌లో బంకురా జిల్లాలో బిష్ణుపుర్ స్థానం నుంచి బిజెపి సౌమిత్రా ఖాన్‌ను బరిలో దింపింది.

- Advertisement -

ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి అత‌డి మాజీ భార్య‌ సుజాతా మండల్ టీఎంసీ పోటీ చేయ‌నుంది.. ఇది ఇలా ఉంటే . 2021లో ఈ ఇద్ద‌రూ విడిపోయారు. ఆ ప్రాంతంలో ఖాన్‌ కీలక నేతగా ఉన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీని వీడి, భాజపాలో చేరారు. అప్పుడు సుజాత తన భర్త తరఫున ప్రచారం చేశారు. అయితే, 2021లో ఆమె మమతా బెనర్జీ పార్టీలో చేరారు. దాంతో అసహనానికి గురైన ఆయన.. కెమెరా ముందే ఆమెతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు లోక్ స‌భ‌లో అమితుమీ తేల్చుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement