Monday, April 29, 2024

AP : కడప కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారుల దాడులు…లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూపరింటెండెంట్…

కడప బ్యూరో, ప్రభ న్యూస్ : కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడింది. డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయలను ప్రమీల డిమాండ్ చేసింది. అందులో భాగంగా రూ. 50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement