Friday, April 26, 2024

సెలూన్లు, లాండ్రీలకు కరెంట్ ఫ్రీ!

తెలంగాణలోని రజక, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హెయిర్‌ కటింగ్‌ షాపులు, లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్‌ వివరించారు. సీఎం నిర్ణయంపై రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement