Thursday, March 28, 2024

ఆసుప‌త్రిలో చేరిన అక్షయ్ కుమార్..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా సోకిన విష‌యం తెలిసిందే. నిన్న అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. అయితే ఈ రోజు అక్షయ్ కుమార్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యుల స‌ల‌హా మేర‌కు ముందు జాగ్ర‌త్త‌గా ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న‌ట్లు అక్ష‌య్ కుమార్ ఈ రోజు ట్వీట్ చేశాడు. నా కోసం మీరు చేస్తోన్న ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నట్లున్నాయి. మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నా ఆరోగ్యం బాగుంది. అయిన‌ప్ప‌టికీ, ముందు జాగ్ర‌త్త‌గా వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాను. త్వ‌ర‌లోనే తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని భావిస్తున్నాను. జాగ్ర‌త్త‌గా ఉండండి’ అని అక్ష‌య్ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement