Saturday, May 25, 2024

హైదరాబాద్‌లో వింత శిశువు జననం

హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. హైదరాబాద్ కాప్రాకు చెందిన సరళ, విజయ్ కుమార్ దంపతులకు ఈ శిశువు జన్మించింది. హెర్లేక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపంతో ఈ శిశువు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలోని రెండో అంతస్తులో చికిత్స పొందుతున్న ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. గతంలోనూ సరళ నిలోఫర్‌లోనే వింత శిశువుకు జన్మనిచ్చినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా.. కొన్ని రోజుల కిందే హైదరాబాద్‌‌లో చేప ఆకారంలో శిశువు జన్మించిన సంగతి తెలిసిందే. హైకోర్టు సమీపంలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో అచ్చం చేపలా శరీరం ఉన్న బిడ్డ పుట్టింది. కానీ ఈ శిశువు కూడా 2 గంటలకే మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement