Wednesday, May 15, 2024

సాగర్ బీజేపీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..? ఇక దబిడి దిబిడే..!!

తెలంగాణ నాగార్జునసాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. ఈ నేఫథ్యంలో పలు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రభ న్యూస్ డిజిటల్ టీమ్ తీన్మార్ మల్లన్నను సంప్రదించింది. అయితే దీనిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. పైగా ఖండించనూ లేదు. దీంతో సాగర్ బీజేపీ అభ్యర్థిగా మల్లన్న పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇప్పటికే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన మల్లన్నకు ఆవేశంగా దూకుతున్న బీజేపీ మద్దతు దొరికితే.. సాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తే అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్గీకి షాక్ తగలడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement