Sunday, May 5, 2024

జాతిరత్నం దెబ్బ… దేవరకొండ అబ్బా ?

జాతి రత్నాలు సినిమాతో స్టార్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి నటనతో విమర్శకులను సైతం మెప్పించాడు. అయితే ఇప్పుడు వరుస ఆఫర్ లు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు కూడా ఒకే చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు నవీన్ ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వ‌డానికి కూడా నిర్మాత‌లు రెడీ అవుతున్నారట.

డేట్స్ లాక్ చెయ్యటం కోసం హారిక హాసిని సంస్థ న‌వీన్ ఇప్పటికే అడ్వాన్సు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఏకంగా న‌వీన్‌ 5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నడట. అడ్వాన్స్ గా 2.5 కోట్లు, సినిమా పూర్త‌య్యాక మ‌రో 2.5 కోట్లు ఇచ్చేలా డీల్ కుదిరినట్టు తెలుస్తుంది.

అయితే ఇదిలా ఉండగా ఎటువంటి అంచనాలు లేకుండా స్టార్ గా మారిపోయిన నవీన్ పొలిశెట్టి… ఎఫెక్ట్ చాలా వరకు యంగ్ హీరోల పైన పడుతుందని విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక ఆ యంగ్ హీరోలు ఎవరా అంటూ నెటిజన్స్ చర్చించుకోటం మొదలు పెట్టారు. కాగా ఎక్కువ విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటున్నారు. నవీన్ దెబ్బ విజయ్ కి పడే అవకాశమే ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి విజయ్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement