Sunday, May 19, 2024

బడ్జెట్, పిఆర్సీ – కెసిఆర్ కి మంత్రి కొప్పుల కృత‌జ్ఞ‌త‌లు ‌

హైద‌రాబాద్ – అన్ని వ‌ర్గాల‌కు అనుకూల‌మైన బడ్జెట్ ను, ఉద్యోగుల‌కు ఉన్న‌త‌మైన పిఆర్సీని ప్ర‌వేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రి కెసిఆర్ కి మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కొప్పులు ముఖ్య‌మంత్రిని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు.. చక్కని బడ్జెట్ ను ప్రవేశపెట్ల‌డ‌మే కాకుండా, ఎస్సీల సముద్ధరణకు 1,000కోట్లను అదనంగా కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ఘన విజయం సాధించినందుకు శుభాభినందనలు చెప్పారు.30%శాతం పిఆర్సీ ప్రకటించడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని మంత్రి కొప్పుల ముఖ్యమంత్రి కి వివరించి, వారి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement