Saturday, April 27, 2024

18 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు.. యువతి మృతి

బ్రిటన్‌కు చెందిన అషాంటీ స్మిత్ అనే అమ్మాయి కొత్త రకం వ్యాధితో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచింది. రెండు కోట్ల మందిలో అరుదుగా కనిపించే హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా అనే జన్యుసంబంధ లోపంతో ఆమెకు 18 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు వచ్చాయి. అషాంటీ 8వ ఏట ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. ఏడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు కనిపించేవి. అయితే, అషాంటీ 18 ఏళ్ల వయసులో అందరినీ విషాదంలో ముంచెత్తుతూ కన్నుమూసింది. అప్పటికే తీవ్ర వృద్ధాప్య లక్షణాలు ఆమెను చుట్టుముట్టాయి.

అషాంటీ తాను చనిపోయేంత వరకు తనలోని విషాదాన్ని మౌనంగా భరిస్తూ, అందరినీ నవ్వించేది. పైగా తాను త్వరలోనే చనిపోతానని తెలిసి కూడా ఆమె ముఖంపై నవ్వు చెరగలేనదని తల్లి లూయిస్ స్మిత్ వెల్లడించింది. ఆమె బీటీఎస్ సంగీతానికి అభిమాని అని, ఆమె అంత్యక్రియల్లో బీటీఎస్ సంగీతం వినిపిస్తామని పేర్కొంది. తమ కుమార్తె జ్ఞాపకార్థం హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడే వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని లూయిస్ స్మిత్ వివరించింది.

ఈ వార్త కూడా చదవండి: త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక

Advertisement

తాజా వార్తలు

Advertisement