Thursday, April 18, 2024

మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించనున్న మెగాస్టార్..!

సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి మంచి జోరు మీద వున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఆయన ఓ సినిమా కోసం డబల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొంద‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ట‌.. అది కూడా తండ్రీ కొడుకులుగా. రీసెంట్‌గానే డైరెక్ట‌ర్ బాబీ.. చిరంజీవిని క‌లిసి స్క్రిప్ట్ నెరేట్ చేశార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్న మెగాస్టార్‌, త‌దుప‌రి మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టిస్తారు. అది పూర్తి కాగానే బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని టాక్‌.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచే కొత్త రేషన్ కార్డుల జారీ

Advertisement

తాజా వార్తలు

Advertisement