Thursday, May 16, 2024

అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీని సందర్శించిన – ప్ర‌భుత్వ మాజీ విప్ చింతమనేని

ముసునూరు ..ప్రభ న్యూస్ – ప్ర‌భుత్వ మాజీ విప్, మాజీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండవలసిన ఇలాంటి ఫ్యాక్టరీలు గ్రామాల మధ్యన ఉండటం సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఉంచాలా లేదా అనే కోణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులకు అందించిన నష్టపరిహారం ..ఈ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదంలో గాయపడిన, మరణించిన కుటుంబాలకు అదే రీతిలో నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని ప్రభాకర్ అన్నారు. ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన బొప్పూడి కిరణ్ కుటుంబాన్ని చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లు దేవినేని డాలరాం, కాపా శ్రీనివాసరావు, ముసునూరు మాజీ జెడ్పిటిసి చిలుకూరు వెంకటేశ్వరావు, నూజివీడు తెలుగు రైతు సంఘం అధ్యక్షులు అక్కినేని చంద్రశేఖర్, పార్టీ ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు. కార్యకర్తలు ,పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement