Wednesday, May 8, 2024

Tirumala : తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. తిరుమ‌ల‌లో దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. భ‌క్తుల‌కు ఇలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 68,995 మంది భక్తులు దర్శించుకోగా 29,037 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement